వంద మందికి కోటి రూపాయలు ‌‌– విజయ్​దేవరకొండ

వంద మందికి కోటి రూపాయలు ‌‌– విజయ్​దేవరకొండ

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకుంది. మూడు రోజుల్లో 70.23 కోట్ల రూపాయలు రాబట్టిన ఖుషి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకుడు శివ నిర్వాణ తదితర చిత్రబృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ - నైజాం ఏరియాలో ఖుషి సినిమాకు మూడు రోజుల్లోనే పెట్టుబడి 75శాతం తిరిగి వచ్చింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో హయ్యెస్ట్ ఫస్ట్ 3డేస్ కలెక్షన్ ఖుషిదే. ఈ కలెక్షన్స్ ఇక్కడితో ఆగవు. లాంగ్ రన్ ఉంటుంది. ఫ్యామిలీస్, యూత్ అందరూ ఖుషికి కనెక్ట్ అయ్యారు అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ - మా సంస్థకు ఖుషి లాంటి మెమొరబుల్ మూవీ ఇచ్చిన విజయ్, సమంత, శివ అందరికీ థ్యాంక్స్. మణిరత్నం రోజా లాంటి ఫీల్ ఇచ్చే సినిమా ఇది. ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను నిర్మించినందుకు గర్వంగా ఉంది. ఖుషికి ఫస్ట్ త్రీ డేస్ లోనే 75 పర్సెంట్ రికవరీ అయ్యిందంటే మామూలు విషయం కాదు. విజయ్ కెరీర్ లో ఇది హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుందని అనుకుంటున్నాం. ఖుషి రిలీజైన ఉదయం నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా యూఎస్ కాల్స్ వస్తున్నాయి. సినిమా బాగుందని అక్కడి వారు చెబుతున్నారు.ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ మరో రెండు వారాల్లో మరిన్ని జరిపిస్తాం అన్నారు.