జగిత్యాలలో భగ్గుమన్న బానుడు...

జగిత్యాలలో భగ్గుమన్న బానుడు...
  • రాష్ట్రంలో రెండవ 46.6 అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా సూర్యప్రతాపంతో మండిపోయింది.. భానుడి భగభగలకు ప్రజలు ఇళ్ళకి పరిమితమయ్యారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్లలో రాష్ట్రంలోనే రెండవ అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎండలు మండుతున్న సందర్భంగా ప్రజలు తగు జాగ్రత్త తీసుకోవాలని అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.