ఉష్ణోగ్రతల వల్ల బెంబేలు ఎత్తుతున్న భాగ్యనగరం

ఉష్ణోగ్రతల వల్ల బెంబేలు ఎత్తుతున్న భాగ్యనగరం

ముద్ర,హైదరాబాద్ : నిన్నటి వరకు వణుకు పుట్టించిన చలి కనిపించకుండా పోయింది. భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. నిన్న మొన్నటి వరకు ఉదయం 8 గంటల వరకు కూడా కనిపించని భానుడు.. గత రెండు రోజులుగా సెగ మొదలుపెట్టాడు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.మంగళవారం నగరంలో 35.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.భాగ్యనగరంలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు దడ పుట్టిస్తున్నాయి.