భారత్- వెస్టిండీస్ మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్
రోసో : డొమినికా విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియంలో బుధవారం భారత్-వెస్టిండీస్ జట్లు టెస్ట్ కు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా రానున్నాడు. శుభ్ మన్ గిల్ మూడో నెంబర్ లో రానున్నాడు. భారత తుది జట్టులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, కోహ్లీ, రహానే, జడేజా, ఇషాన్, అశ్విన్, శార్దూల్ పటేల్, జయదేవ్, సిరాజ్ ఉన్నారు. కడపటి వార్తలు అందేసరికి వెస్టిండీస్ 18 ఓవర్ల లో 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది.