అశ్విన్450, షమీ 400 వికెట్లు | Mudra News
న్యూఢిల్లీ: భారత్ ఆస్ర్టేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత సాధించిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మహ్మద్ షమీ 400 వికెట్లు పడగొట్టాడు. డేవిడ్ వార్నర్ను అవుట్ చేయడం ద్వారా షమీ ఈ సంఖ్యను చేరుకున్నాడు. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 400 ప్లస్ వికెట్లు సాధించిన భారత బౌలర్లలో చోటు సాధించాడు.