అశ్విన్​450, షమీ 400 వికెట్లు | Mudra News

అశ్విన్​450, షమీ 400 వికెట్లు | Mudra News

న్యూఢిల్లీ: భారత్ ​ఆస్ర్టేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచుల్లో ఈ ఘనత సాధించిన బౌలర్​గా రికార్డుల్లోకెక్కాడు.  అన్ని ఫార్మాట్లలో కలిపి మహ్మద్​ షమీ 400 వికెట్లు పడగొట్టాడు. డేవిడ్​ వార్నర్​ను అవుట్​ చేయడం ద్వారా షమీ ఈ సంఖ్యను చేరుకున్నాడు. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్​లో అన్ని ఫార్మాట్లు కలిపి 400 ప్లస్​ వికెట్లు సాధించిన భారత బౌలర్లలో చోటు సాధించాడు.