భారత్ 4 వికెట్లకు 118 పరుగులు
- సూర్యకుమార్ యాదవ్హాఫ్ సెంచరీ
ఫ్లోరిడా : భారత్ , వెస్టిండీస్ జట్ల మధ్య లాండర్ హిల్లో జరుగుతున్న కీలకమైన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందేసరికి భారత్ జట్టు 15 ఓవరల్లో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగుల చేసింది. ఆట ప్రారంభంలోనే యశస్వి జైస్వాల్ 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత శుభమన్ గిల్ 9 , సంజూ సాంసన్ 13 పరుగులకు ఐటయ్యారు. తిలక్ వర్మ కాస్త ధాటీగా ఆడినా 18 పరుగులు చేసి రోస్టన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అభిమానులను నిరాశ పరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడడంతో స్కోర్ ముందుకెళ్లింది. సూర్య 53 పరుగులతో , కెప్టెన్ హార్దిక్ పాండ్యా 7 పరుగులతో ఆటలో ఉన్నారు. వర్షం పడడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.