భారత్​ 4 వికెట్లకు 118 పరుగులు

భారత్​ 4 వికెట్లకు 118 పరుగులు
  • సూర్యకుమార్​ యాదవ్​హాఫ్​ సెంచరీ  

ఫ్లోరిడా : భారత్ , వెస్టిండీస్‌ జట్ల మధ్య  లాండర్​ హిల్​లో జరుగుతున్న కీలకమైన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.  కడపటి వార్తలు అందేసరికి  భారత్​ జట్టు 15 ఓవరల్లో 4 వికెట్​లు కోల్పోయి  118 పరుగుల చేసింది.   ఆట ప్రారంభంలోనే  యశస్వి జైస్వాల్​ 5 పరుగులు చేసి ఔటయ్యాడు.  ఆ తర్వాత శుభమన్​ గిల్​ 9 , సంజూ సాంసన్​ 13 పరుగులకు ఐటయ్యారు. తిలక్ వర్మ కాస్త ధాటీగా ఆడినా 18 పరుగులు చేసి రోస్టన్​ బౌలింగ్ లో  క్యాచ్​ ఇచ్చి అభిమానులను నిరాశ పరిచాడు.  అయితే  సూర్యకుమార్​ యాదవ్​ నిలకడగా ఆడడంతో స్కోర్​ ముందుకెళ్లింది. సూర్య  53 పరుగులతో , కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా 7 పరుగులతో ఆటలో ఉన్నారు.   వర్షం పడడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.