మూడో టెస్టు మూడు రోజుల్లోనే ముగించిన ఆసీస్

మూడో టెస్టు మూడు రోజుల్లోనే ముగించిన ఆసీస్

అనుకున్నట్లుగానే మూడో టెస్టు మూడు రోజులకే ముగిసింది. అద్భుతాలు ఏమ్ జరగలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.  76 పరుగుల చిన్న టార్గెట్‎తో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 78 రన్స్ చేసి విజయం సాధించింది.

ఓపెనర్ ఖవాజా వికెట్ మాత్రమే భారత బౌలర్లు తీయగలిగారు. అయితే..తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్ (28), ట్రావిస్ హెడ్ (49) పరుగులతో కాస్త దూకుడుగా ఆడారు. వీరిద్దరు నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.భారత్ స్పినర్లు ఏమైనా అద్భుతం చేస్తారని భావించని అభిమానులకు నిరాశే మిగిలింది.