హోలీ వేడుకల్లో టీమిండియా

హోలీ వేడుకల్లో టీమిండియా

హోలీ వేడుకలను టీమిండియా ఆటగాళ్లు ఘనంగా జరుపుకున్నారు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు అహ్మదాబాద్ లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు అహ్మదాబాద్ కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ కు వెళ్లే సమయంలో బస్సులో, ఆ తర్వాత మైదానంలో భారత ఆటగాళ్లు హోలీ జరుపుకున్నారు. రంగులు పూసుకుని ఎంజాయ్ చేశారు. రంగులతో నిండిపోయిన ఆటగాళ్లు నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. మరోవైపు నాలుగు మ్యాచ్ ల ఈ టెస్ట్ లో ఇండియా 2-1తో లీడ్ లో ఉంది. చివరి టెస్ట్ ను కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ పట్టుదలతో ఉంది.