ఈసీకి కేసీఆర్ రిక్వెస్ట్....ఎందుకంటే....!
ముద్ర,తెలంగాణ బ్యూరో:- లోక్ సభ ఎన్నికలకు సిద్దమైయ్యారు కేసీఆర్. ఈ క్రమంలో ప్రజలకు దగ్గరయేందుకు ఇటీవల పర్యటనలు చేపట్టారు. ఇటీవల సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు కోరింది. కాగా వివరణ ఇచ్చేందుకు వారం గడువు కావాలని ఈసీని కేసీఆర్ కోరారు. మరి కేసీఆర్ అడిగిన రిక్వెస్ట్ పై ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.