తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన ...

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన ...

ముద్ర,తెలంగాణ:- లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 5, 9వ తేదీల్లో రాహుల్‌గాంధీ.. 6, 7 తేదీల్లో ప్రియాంకగాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 5న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నిర్మల్‌లో ఉదయం 11 గంటలకు జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. అదే విధంగా సాయంత్రం నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌లోని గద్వాల్‌లో జరిగే సభలో పాల్గొంటారు.