హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మ‌రో కేసు న‌మోదు

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మ‌రో కేసు న‌మోదు

ముద్ర,తెలంగాణ:- ఇటీవ‌ల ఓ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్‌తో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పోలీసులు కేసు న‌మోదు చేసిన విషయం విధిత‌మే. తాజాగా ఆయ‌న పై మ‌రో కేసు న‌మోదైంది. ఏప్రిల్ 30న ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారని ఫిర్యాదుతో జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు.

కాగా, ఇటీవలే పోలీసులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండడంతో పలువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు రెచ్చిపోతున్నారని.. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులను అయినా వదలేది లేదని..ఖబర్ధార్ మిత్తితో సహా చెల్లిస్తామని గత నెల రోజుల కిందట హెచ్చరించారు.తాజాగా మరో కేసు నమోదు అయింది. కాంగ్రెస్ నేత సైదయ్య ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు.