రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అయినా ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయడంలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్నారు. 30వ తేదీన మహబూబ్నగర్లో నిరుద్యోగ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుందని అన్నారు.