శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి మాతకు కరెన్సీ నోట్ల అలంకరణ

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి మాతకు కరెన్సీ నోట్ల అలంకరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఏడవ రోజున అమ్మవారిని రూ.11,11,111 కరెన్సీ నోట్లతో అలంకరించారు.    అభిషేక్ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మహాజన్ పర్యవేక్షిస్తున్నారు.