ఖమ్మం సిటీ బస్ స్టాండ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం సిటీ బస్ స్టాండ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
Minister Puvvada ajaykumar

ఖమ్మం పాత బస్ స్టాండ్ ను ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సంకల్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఖమ్మం సిటీ బస్ స్టాండ్ గా మార్చి నేడు దానిని లాంఛనంగా ప్రారంభించారు. ఎంతో చరిత్ర కలిగిన ఖమ్మం బస్స్టాండ్ ను రూ.50 లక్షలతో ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి  అన్నారు. అనంతరం సిటీ సర్వీసెస్ లను జెండా ఊపి ప్రారంభించారు. పాత బస్టాండ్ ను పునరుద్ధరణ చేయడం పట్ల స్థానిక వ్యాపారులు, వివిధ పనుల నిమిత్తం ఖమ్మం వచ్చే ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ గజ మాలలతో మంత్రి ని సత్కరించారు. వారి వెంట ఎంపి నామా నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.