బాలికలతో కరాటే విన్యాసాలు చేసిన మంత్రి

బాలికలతో కరాటే విన్యాసాలు చేసిన మంత్రి
Happy National Girl Child Day
  •  బాలికలందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు 

పాలకుర్తి మండల కేంద్రంలో చెన్నూర్ లో జాతీయబాలికా దినోత్సవ సందర్భంగా హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలికలతో కలిసి కరాటే విన్యాసాలు చేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , మంత్రి మాట్లాడుతూ బాలికల ఆత్మ రక్షణ, సంరక్షణ, సంక్షేమం, సమానత్వానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది, బాలికల విద్య, వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది బాలికల పట్ల దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు బాలికలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం, చెన్నూరులో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాలికలతో కలిసి కరాటే విన్యాసాలు చేశారు.బాలికలు ఆత్మ రక్షణ కోసం కరాటే ఉపయోగ పడుతుంది అన్నారు. బాలికలను అభినందించారు. బాలికలకు జాతీయ బాలికా దినోత్సవం  శుభాకాంక్షలు తెలిపారు.ఆడపిల్లలకు సమాజంలో సమాన అవకాశాలు, సమానత్వం, సంరక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.బాలికల విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్  అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు చేశారని తెలిపారు.

బాలికల రక్షణకు, బాలికల భ్రూణ హత్యల నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు.ఆడపిల్ల కడుపులో పడ్డప్పటి నుంచి పెద్దయి పెళ్లి చేసుకుని తల్లి అయ్యేవరకు ప్రతి దశలో అమ్మగా అన్నగా మేనమామగా తోడు ఉంటూ చేయూతనిస్తుందని అన్నారు, ఆడపిల్లలపై దాడులు చేసిన వారు అమానుషంగా వ్యవహరించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటుందని వారి రక్షణకు షి టీమ్స్, భరోసా కేంద్రాలు సఖి సెంటర్లు, పెట్టి అండగా నిలుస్తుంది అన్నారు, మరోసారి బాలికలకు జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సర్పంచ్ కార్యకర్తలు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.