ఖరాబైన బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఇచ్చారు: ఎమ్మెల్యే రాజా సింగ్
![ఖరాబైన బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఇచ్చారు: ఎమ్మెల్యే రాజా సింగ్](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d2765f8aacc.jpg)
హైదరాబాద్: నాకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కారాబ్ అయితే రెండు రోజుల క్రితం పురానాపూల్ చౌరస్తాలో వదిలిపెట్టి వచ్చినని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. తనకు పాడైపోయిన కారు ఇచ్చారని అయన మండిపడ్డారు. రాజా సింగ్ మాట్లాడుతూ ఆ బులెట్ ప్రూఫ్ వెహికిల్ ను మళ్ళీ రిపేర్ చేయించి నా దగ్గరకు తీసుకువచ్చారు.
ఇప్పటికే ఇట్లా చాలాసార్లు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ రిపేరుకు వస్తుంది. ఎక్కడ ఆగిపోతుందో నాకే తెలుస్తలేదు. గతంలో కూడా చాలా సార్లు చెప్పిన ఎక్కడ పడితే అక్కడే ఆగుతుందని. అఖయినా ఖరాబైన వెహికల్ ని మళ్లీ మళ్లీ నాకే ఎందుకు పంపిస్తున్నరనీ పోలీస్ ఉన్నతాధికారులను అడిగాను. అధికారుల పేర్లు చెప్పను కానీ.... ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే వెహికల్ ను ఎమ్మెల్యే రాజా సింగ్ కు పంపమని చెప్పారట అని అన్నారు.