కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి - కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి - కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి

ముద్ర, ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు మాజీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య,సద్ది లక్ష్మారెడ్డిలను సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాన బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే ఎన్నికలలో గెలిచే విధంగా అందరం కష్టపడి పని చేయాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు రామ్ రెడ్డి, నాయకులు చెన్ని బాబు, గంట బుచ్చా గౌడ్, గంగయ్య, లక్ష్మణ్, పరశురాములు, తిరుపతిరెడ్డి ,మామిండ్ల కిషన్ ,తిరుపతి గౌడ్, సంతోష్,సిరిసిల్ల సురేష్, కటిక రవి, లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు.