లడఖ్‌ లో 4.3 తీవ్రతతో భూకంపం

లడఖ్‌ లో 4.3 తీవ్రతతో భూకంపం

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో మంగళవారం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఉదయం 10.47 గంటలకు భూమి కంపించింది. ఇప్పటివరకు, భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగినట్లు తెలియలేదు. భూకంప కేంద్రం లేహ్ పట్టణానికి ఉత్తరాన 166 కిలోమీటర్ల దూరంలో 105 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, మంగళవారం మొత్తం పలు ప్రాంతాల్లో కలిపి మూడుసార్లు భూమి కంపించింది. మంగళవారం ఉదయం, ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది , ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు వచ్చాయి. రాత్రి 10.20 గంటల ప్రాంతంలో భయాందోళనకు గురైన నివాసితులు తమ భవనాల నుండి బయటకు వచ్చారు.