కాంగ్రెస్ కు వీడి బీఆర్ఎస్ లో చేరిన శాసనసభ్యులకు షాక్

కాంగ్రెస్ కు వీడి బీఆర్ఎస్ లో చేరిన శాసనసభ్యులకు షాక్

ముద్ర, తెలంగాణ  బ్యూరో:-గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరిన వారికి ప్రజలు గట్టి షాక్ నిచ్చారు. అప్పట్లో  కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలో 12 మంది శాసనసభ్యులు చేరారు. తాజా ఫలితాల్లో 10 మంది ఎమ్మెల్యేలకు చుక్కెదురు అవుతోంది. వారిలో ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్, తాండూరులో రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ లో బీరం హర్షవర్ధన్ రెడ్డి, నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, పినపాకలో రేగా కాంతారావు, కొత్తగూడెంలో వనమావెంకటేశ్వరరావు ఓటమి దిశగా సాగుతున్నారు. ఇక ఇప్పటికే ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఓటమి పాలయ్యారు.