మేడిగడ్డ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి బృందం

ముద్ర,తెలంగాణ:- మేడిగడ్డ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. ఎంఐఎం సభ్యులు వీరి వెంట ఉన్నారు. ఈ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు. రోడ్డు మార్గాన మధ్యాహ్నం 3:30 గంటలకు చేరుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రుల పర్యటన నేపధ్యంలో ప్రాజెక్టు సమీపాన పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. సాయంత్రం 5-6 గంటల మధ్య పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఆ తర్వాత సీఎం రేవంత్‌, మంత్రుల మీడియా సమావేశం ఉండనున్నాయి. ఇక రాత్రి 7 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నారు సీఎం బృందం.