అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్..

  • తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం
  • రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారు.
  • వెంకటస్వామి గారి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు.
  • రీడిజైన్ పేరుతో బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచింది.
  • రూ.1లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారు
  • ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారు..
  • వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా?
  • ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు..
  • ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారు.
  • కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయంచేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి..
  • దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది.
  • విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చింది...
  • అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉంది..
  • సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది..
  • అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దాం..
  • కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నా..
  • మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి..  మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండి..
  • మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పండి..
  • తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పండి..
  • జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా?
  • తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటి..?
  • కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారు..
  • కాళేశ్వర్ రావు గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా..
  • మీకు బస్సుల్లో  రావడం ఇబ్బంది అనుకుంటే... హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంది..
  • రేపో ఎల్లుండో సాగునీటి  ప్రాజెక్టులపై మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేస్తారు
  • కాళేశ్వరం కథేంటో సభలో తెలుద్దాం...