అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్..
- తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం
- రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారు.
- వెంకటస్వామి గారి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు.
- రీడిజైన్ పేరుతో బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచింది.
- రూ.1లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారు
- ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారు..
- వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా?
- ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు..
- ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారు.
- కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయంచేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి..
- దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది.
- విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చింది...
- అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉంది..
- సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది..
- అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దాం..
- కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నా..
- మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి.. మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండి..
- మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పండి..
- తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పండి..
- జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా?
- తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటి..?
- కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారు..
- కాళేశ్వర్ రావు గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా..
- మీకు బస్సుల్లో రావడం ఇబ్బంది అనుకుంటే... హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంది..
- రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేస్తారు
- కాళేశ్వరం కథేంటో సభలో తెలుద్దాం...