రైతులకు ఏసంగీ పంటకు సాగు నీటిని విడుదల చేయాలి
- అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర ముత్తారం: ముత్తారం మండలంలోని లక్కారం టు టిఎంసి నుండి మండలం రైతులకు ఏసంగీ వరిపంట వేసుకోవడానికి నీటిని విడుదల చేయాలని అధికారులను గురువారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సాగునీటిని అందించి, రైతులను రక్షించుకోవాలని శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. సాగునీటి విడుదలకు కృషి చేసిన మంత్రి శీను బాబుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.