‘పల్లా’ను కలిసిన జనగామ లీడర్లు

‘పల్లా’ను కలిసిన జనగామ లీడర్లు

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు పానుగంటి రహేళ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 13వ వార్డు బీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్సిటీ లో మర్యాదపూర్వకంగా కలిసిన వారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పల్లాకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కలిసిన వారిలో బీఆర్ఎస్ లీడర్లు పానుగంటి ప్రవీణ్‌, పానుగంటి సువార్త, మహిళ అధ్యక్షురాలు బొట్ల పుష్ప, సీసా రాజు, నల్ల వినోద్, తోట సుభాష్, పులి సాయికృష్ణ, సుంచు సత్యమూర్తి, చెన్నోజు పూర్ణశేఖర్, తిప్పారపు ఉమేశ్‌, జాలిగం శివసాయి, డాక్టర్‌‌ బి.ఆర్ అంబేద్కర్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బక్క సునీల్, సాగర్, భాస్కర్, ఉమేష్ ఉన్నారు.