స్థానికేతరులను తరిమికొట్టాలి

స్థానికేతరులను తరిమికొట్టాలి
  • జనగామ బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంత రెడ్డి
  • చివరి రోజు భారీ బైక్ ర్యాలీ

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామలో పోటీ చేస్తున్న స్థానికేతరులను తరిమికొట్టాలని బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు మంగళవారం జనగామ పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గీత ఆశ్రమం నుంచి గ్రెయిన్ మార్కెట్, అమ్మ బాయి, రైల్వే స్టేషన్, నెహ్రూ పార్క్ మీదుగా బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీతో జనగామ ప్రాంతం కాయషామయంగా మారింది.

ఈ సందర్భంగా పట్టణంలోని చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ జనగామ నియోజకవర్గం ఏర్పాడి నాటి నుంచి నేటి వరకు స్థానికేతరులే పాలించారన్నారు. వారి చెరలో పడి నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదన్నారు. ఈసారి స్థానికుడిగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆరుట్ల కోరారు. ‘మీ సమస్యలు తెలిసిన వాడిని, మీ వాడిని, నిత్యం మీకు అందుబాటులో ఉండే వాడిని.. జనగామ జిల్లా కోసం ముందుండి ఉద్యమించిన వాడి..’ అంటూ ఆరుట్ల ఓటర్లను అభ్యర్థించారు. సమావేశంలో బీజేపీ లీడర్లు కేవీఎల్‌ఎన్‌ రెడ్డి, ఉడుగుల రమేశ్, సౌడ రమేశ్‌, దేవరాయ ఎల్లయ్య, మహిపాల్‌ యాదవ్‌, పవన్​శర్మ, హరిశ్చంద్ర గుప్త, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.