Arun Pillai Bail Petition అరుణ్ పిళ్ళయ్ బెయిల్ పిటిషన్ విచారణలో కవిత పేరు
Delhi Liquor Scam ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడైన అరుణ్ పిళ్ళయ్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఆయన బెయిల్ పిటిషన్పై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణ్ పిళ్ళయ్ సౌత్ గ్రూపుల్ కీలకంగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. లిక్కర్ పాలసీ ద్వారా స్కామ్ జరిగిందని ఈడీ చెప్పింది.
పిళ్ళయ్ బెయిల్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించిన ఈడీ. కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్ళయ్ వ్యవహరించారని తెలిపింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవితకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపామని ఈడీ కోర్టుకు తెలిపింది. లిఖిత పూర్వకంగా వాదనలు వినిపించాలని పిళ్ళయ్ తరపు న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్ 2కు వాయిదా వేసింది.