ఢిల్లీ ని వణికించిన భూకంపం 

ఢిల్లీ ని వణికించిన భూకంపం 
  • రిక్టర్ స్కేల్‌పై 6.0


ముద్ర,సెంట్రల్ డెస్క్: ఢిల్లీలో గురువారం భూకంపం సంభవించినట్లు తెలిసింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది.దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది.ఇస్లామాబాద్‌తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు సంభవించాయి.