బీఆర్ఎస్ కు ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా 

బీఆర్ఎస్ కు ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా 

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ కు మరో ఎంపీ రాజీనామా చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజినామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖ ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్  కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఆయనకు చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యoలో నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను. ఇన్ని రోజులు పార్టీలో నా చేవెళ్ల ప్రజలకి సేవ చేసేoదుకు అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా రాజీనామా ఆమోదించాలని వారికి విజ్ఞప్తి. ఇన్నాళ్లూ నాకు పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు.