వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ ప్రదానం

న్యూఢిల్లీ, ముద్ర: భారత మాజీ ఉపరాష్ట్రపతి, బీజేపీ సీనియర్ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడుకు సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను సత్కరించారు. రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరుగుతోంది. వివిధ రంగాలలో విశేష ప్రతిభను కనపరిచిన ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు చిరంజీవిలకు పద్మ విభూషణ్ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుణ్ని పద్మ విభూషణ్ ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్ షా, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.