నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి దుర్మరణం

హైదరాబాద్, ముద్ర: ఒక ప్రైవేటు హాస్టల్ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైంది.  హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లోని షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్ లో ఓ దారుణం జరిగింది. ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్ (24) మృతి చెందాడు. ఈ హాస్టల్ ఎంట్రన్స్ లోనే నీటి సంపు వుంది. దీని మూతను ఎవరో తెరిచివుంచారు. టిఫిన్ తెచ్చుకోడానికి బయటకు వెళ్లిన అక్మల్ తిరిగి హాస్టలుకు చేరుకునే టప్పుడు ఆ నీటి సంపును చూసుకోకుండా నడిచి వెళ్తూ, ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. సంపుపై మూత పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ యజమాని మధుసూదన రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.