సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
CM KCR condoles Sayanna's death

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  సంతాపం ప్రకటించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధ్పడుతున్న సాయన్న.. చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల సిఎం విచారం వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యే గా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను...తనతో వారికున్న అనుబంధాన్ని,  సిఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.