Earthquake in Gujarat: గుజరాత్లో రెండు ప్రాంతాల్లో భూకంపం
కచ్ , అమ్రేలి ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8, 3.3 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కచ్ జిల్లాలో ఉదయం 10.49 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. లఖ్పట్ టౌన్కు 62 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. రెండోది అమ్రేలి జిల్లాలో ఈ తెల్లవారుజామున 1:42 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది.
మిటియాల గ్రామ సమీపంలో 7.1 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం ధాటికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే, వరుస భూకంపాలతో గుజరాత్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అమ్రేలిలో గత వారం రోజుల్లోనే 3.1, 3.4 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించడం ఇది ఐదోసారి.