కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం
- ఉప ముఖ్యమంత్రిగా డీకే
- మరో ఎనిమిది మంది మంత్రుల ప్రమాణం
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం నాడు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గేహ్లోత్ ఆయన చేత ప్రమాణం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ యువ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ అనుభవం కలిగిన సిద్ధరామయ్యకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో గట్టి పట్టు ఉంది. పిసిసి అధ్యక్షుడు డి కే శివ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటకలో అత్యంత సంపన్న రాజకీయవేత్తగా పేరు ఉన్న శివకుమార్ కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు. మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.