కన్నుల పండువగా రామలింగేశ్వరస్వామి కల్యాణం

కన్నుల పండువగా రామలింగేశ్వరస్వామి కల్యాణం
కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు
  • ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ మండలం రాయరావుపేటలో సోమవారం రాత్రి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సం కన్నుల పండువగా జరిగింది. విశేష పూలతో అలంకరించిన ముత్యాల పందిరిలో ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి వేద పండితుల మంత్రోత్సవాల నడుమ కల్యాణక్రతువు ఘనంగా జరిపారు. ఈ కల్యణ మహోత్సవానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.

వేలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గోలి పింగళ్ రెడ్డి, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, గడ్డం బాల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు సత్తిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గోలి నరేందర్ రెడ్డి, దండెం ప్రభాకర్, మన్నే బాలరాజ్, ఉడుత నవీన్, తల్లం ప్రకాష్, సురేష్, సత్యనారాయణ, వంశీ, రాజేష్, పాండురంగం గౌడ్, శ్యామ్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.