జేఎన్‌టీయూలో విద్యార్థుల ఆందోళన

జేఎన్‌టీయూలో విద్యార్థుల ఆందోళన

ముద్ర,తెలంగాణ బ్యూరో:- కూకట్పల్లి JNTUలో ప్రిన్సిపల్‌ ఛాంబర్‌ వద్ద విద్యార్థుల ఆందోళన చేపట్టారు. రెండేళ్ల నుంచి మెస్‌ ఛార్జీలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చదువుకోవడానికి వస్తే.. మెస్ చార్జీలు, హాస్టల్ వసతులతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్రమైన భవిష్యత్తుకు చివరిదశ అయిన పీజీ స్థాయిలో ఇలా ఇబ్బందుతో చదువుకోలేక పోతున్నామని వాపోయారు. వెంటనే మెస్‌ ఛార్జీలతో పాటు హాస్టల్‌లో వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు.లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.