Amritpal Absconding: అమృత్‌పాల్‌ పరారీపై న్యాయస్థానం ఆగ్రహం

Amritpal Absconding: అమృత్‌పాల్‌ పరారీపై న్యాయస్థానం ఆగ్రహం

చండీగఢ్‌: 'మీ వద్ద 80 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వారంతా ఏం చేస్తున్నారు? అమృత్‌పాల్‌ సింగ్‌ ఎలా తప్పించుకున్నాడు?' అంటూ పంజాబ్‌- హరియాణా హైకోర్టు మంగళవారం పంజాబ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  పరారీలో ఉన్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై హైకోర్టు స్పందిస్తూ.. అమృత్‌పాల్‌ సింగ్‌ తప్పించుకోవడం రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యమేనని పేర్కొంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలంటూ పంజాబ్‌ పోలీసులను ఆదేశించింది. అమృత్‌పాల్‌ పంజాబ్ సరిహద్దులు దాటి ఉంటాడని పోలీసులు అనుమానిస్తోన్న వేళ.. హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.