పవన్‌పై పోటీకి ట్రాన్స్‌జెండర్

పవన్‌పై పోటీకి ట్రాన్స్‌జెండర్

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై). 32 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పుంగనూరుతో సహా రాష్ట్ర రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్‌ జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనుంది.