ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతల రోడ్డులో ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం ఎదుర్లపాలెం జంక్షన్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులు విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన వారిగా గుర్తించారు. గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.