కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు

కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు

బస్సు యాత్రతో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ..బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సహం నింపుతున్న మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ తగిలింది. ఈరోజు సీఈఓ వికాస్ రాజ్ ను కలిసి కేసీఆర్‌పై వీహెచ్‌పీ (విశ్వహిందూ పరిషత్) నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారాల్లో హిందువుల మనోభావాలను దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఆయన పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్లు చెప్పారు. కాగా హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వీహెచ్‌పీ నేతలు హెచ్చరించారు.