సంక్షేమంలో మనమే నంబర్‌‌ వన్‌

సంక్షేమంలో మనమే నంబర్‌‌ వన్‌

సంక్షేమంలో మనమే నంబర్‌‌ వన్‌– జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ:సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశంలో నంబర్‌‌ వన్‌ స్థానంలో ఉందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జనగామ నియోజకవర్గ స్థాయి సంక్షేమ సంబురాల కార్యక్రమం స్థానిక భ్రమరాంబ గార్డెన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరై మాట్లాడారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ ఇద్దరికీ రూ.50 వేల చొప్పున, కులాంతర వివాహాలు చేసుకున్న మూడు జంటలకు రూ.2.50 లక్షల చొప్పున అందజేశారు. అదేవిధంగా ఆరుగురికి గొర్రెల యూనిట్లు, ఇద్దరికీ బీసీ రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్, ఏపీడీ నూరుద్దీన్, నియోజకవర్గ స్థాయి అధికారులు, సంబంధిత  సిబ్బంది పాల్గొన్నారు.