పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కడియం

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కడియం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లిలో ముదిరాజుల కుల దైవం పెద్దమ్మ తల్లి ఉత్సవాలు  జరుగుతుండగా మంగళవారం మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పెద్దమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఎంపీటీసీ బూర్ల లతా శంకర్, నీల లింగం, చెన్నూరు వెంకటేశ్వర్లు, నీల బుచ్చయ్య, కొండ వేణు, సంకెళ్ల రవి, నీల సోమయ్య, పిట్టల వెంకటయ్య, పిట్టల మల్లయ్య, చిక్కుడు శంకర్, బెల్దే వెంకన్న, ఎంపీటీసీ రజాక్, సర్పంచ్ సారంగపాణి, నాయకులు ఐ.సుధాకర్ ఆర్.మధుసూదన్ రెడ్డి, స్వామి నాయక్, నరేందర్ రెడ్డి, ఐలయ్య, యాకూబ్ పాషా, కోతి రాములు, నీలగట్టయ్య, గోరింటల గిరి తదితరులు ఉన్నారు.
అక్క పల్లి గూడెంలో...
     మండలంలోని అక్కపల్లి గూడెంలో బొడ్రాయి(గ్రామ దేవతల) ప్రతిష్ట జరిగింది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంగళవారం గ్రామాన్ని సందర్శించి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట సర్పంచ్ కడుదుల జ్యోతి నర్సిరెడ్డి, సెల్ కొమురెల్లి, మంద రాజు, లింగన బోయిన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.