ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం

ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
  • భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి,ముద్ర: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ కు చెందిన 45 మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాదులోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే దిశగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు ప్రకాష్ రెడ్డి, 1 వ వార్డ్ కౌన్సిలర్ దారెడ్డి వేణుగోపాల్ రెడ్డి, నార్లకంటి  రాంరెడ్డి  ఇటముని మహేష్,సప్పిడి చంద్రశేఖర్ రెడ్డి, ఇటమోని నరేందర్,సన్న నరసింహ యాదవ్, మునుకుంట్ల లక్ష్మణ్, గుండ్ల నవీన్, ఇటమోని నరసింహ, శ్రీరామ్ పాండు, కొండమడుగు  శ్రీకాంత్,  బండారు శేఖర్ రెడ్డి, బాల్ రెడ్డి, గోదాసు శ్రీశైలం,  వినోద్ రెడ్డి, చంద్రయ్య, జంగారెడ్డి తదితరులు పాల్గోన్నారు.