అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

భువనగిరి :పట్టణంలోని అర్బన్ కానికి చెందిన బొనగాని స్వాతి (21) సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తల్లి బాలలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం సోమవారం పనులు ముగించుకొని ఇంటికి రాగానే తన కూతురు మృతి చెందిందని బోరున విలపిస్తూ చెప్పింది. తన కూతురు ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని మృతి పై అనుమానం ఉన్నట్లు తెలిపింది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై నాగరాజు తెలిపారు.