బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత

బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత

చిగురుమామిడి ముద్ర న్యూస్: కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలంలో జరుగుతున్న బండి సంజయ్ మలిదశ ప్రజాహితయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. చిగురుమామిడి మండలంలో నిన్న ప్రజాహితయాత చేపట్టిన బండి సంజయ్ రాత్రి బొమ్మనపల్లి గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో బస చేశారు.

మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయన బస చేసిన పాఠశాలను  ముట్టడికి హుస్నాబాద్, చిగురుమామిడి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో చిగురుమామిడి మండలంలో ఒక్కసారిగా తీవ్ర ఉధృతంగా నెలకొన్నాయి.

ముట్టడికి వచ్చిన కార్యకర్తలను ఎక్కడికి అక్కడ పోలీసులు అడ్డుకొని హుస్నాబాద్ చిగురుమామిడి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనడానికి ఇతర ప్రాంతాల నుండి వస్తున్న బిజెపి నాయకులను కూడా పోలీసులు కట్టడి చేస్తున్నారు. తమ కార్యకర్తలను అడ్డుకోవడాన్ని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు తమ కార్యకర్తలను అడ్డుకుంటే స్వయంగా  నేనే వెళ్లి కరీంనగర్ కమిషనరేట్ను అడ్డుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని అందుకే ఈ చిల్లర మల్లర వేషాలు వేస్తున్నారని విమర్శించారు.