కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి  

కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి  

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కరీంనగర్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం శంకరపట్నం మండలం ఆముదాల పల్లి గ్రామంలో శక్తి కేంద్ర ఇన్చార్జ్ పెన్ రెడ్డి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి రహిత పాలన కొనసాగిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. గ్రామ పంచాయతీలలో ఎల్ఈడి లైట్లు, వైకుంఠధామాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు. కేంద్రం పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జంగా జైపాల్, సీనియర్ నాయకులు పలకల రాజిరెడ్డి, మండల జనరల్ సెక్రెటరీ దాసర నరేందర్, మండల ఉపాధ్యక్షులు పెసర అర్జున్, sc మోర్చా మండల అధ్యక్షులు కనకం సాగర్, ST మోర్చా మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య, మండల్ సోషల్ మీడియా కన్వీనర్ చుక్కల శ్రీకాంత్, బూత్ అధ్యక్షులు బడుగు రవి, వీరయ్య, మహేందర్ రెడ్డి, శివారెడ్డి, సాయి, అరవింద్ వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు