యువతలో క్రీడాసక్తి పెంచేందుకు చర్యలు

యువతలో క్రీడాసక్తి పెంచేందుకు చర్యలు

యూపీ: యువతలో క్రీడాసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, క్రీడల వల్ల యువతలో ఏకాగ్రత పెరుగుతుందని, మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంటారని తద్వారా దేశానికి కూడా పతకాలు సాధించడంలో కీలకపాత్ర పోషించగలరని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​పూర్​లో నిర్వహిస్తున్న ముగింపు కార్యక్రమం ‘ఖేల్​మహాకుంభ్​’లో ప్రధాని నరేంద్రమోడీ వర్చూవల్​గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒలింపిక్​లో పతకాలు సాధించిన పలువురు క్రీడాకారులను అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ ఖేల్‌ మహాకుంభ్‌ వంటి క్రీడా పోటీలు, ఎఫ్‌ఐటీ ఇండియా, ఖేలో ఇండియా వంటి ప్రచార కార్యక్రమాలు యువతలో క్రీడలపై అవగాహన, ఆసక్తిని పెంచుతున్నాయన్నారు. క్రీడాకారుల కోసం నూతన భవనాలను నిర్మించనున్నామన్నారు. క్రీడల్లో యువతను భాగస్వాములను చేసేందుకు భారీగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన పలువురు క్రీడాకారులకు మెడల్స్​ను అందజేశారు.