బ్రేకింగ్ న్యూస్... భార్యను కత్తెరతో పొడిచి...
![బ్రేకింగ్ న్యూస్... భార్యను కత్తెరతో పొడిచి...](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6437e51d2652c.jpg)
ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ టవర్ సర్కిల్ లోని టైలర్ లో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. భర్త సంతోష్ ఆవేశంతో భార్యను కత్తెరతో పొడిచిన ఘటన కరీంనగర్లో కలకలం రేపుతుంది. గమనించిన స్థానికులు హుటాహుటిన హారతిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.