వాగుల పై వంతెన లు నిర్మించండి.. రోడ్లు బాగు చేయండి - అసెంబ్లీ లో షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ 

వాగుల పై వంతెన లు నిర్మించండి.. రోడ్లు బాగు చేయండి - అసెంబ్లీ లో షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ 

ముద్ర, షాద్‌నగర్ : షాద్‌నగర్  నియోజకవర్గం పరిధిలో వాగు ల పై వంతెన లు,..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు   గుంతల మయంగా మరిన రోడ్లు ను మరమతులు చేయలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ శనివారం అసెంబ్లీలో కొరారు. వర్షాలకు వస్తున్న నదుల వద్ద వంతెనలు నిర్మించకుండా ఉండడంతో ప్రజలు వాగు దాటేటప్పుడు చనిపోతున్నారని  షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ స్పీకర్  కు తేలిపారు.. నియోజక వర్గంలో వర్షాలకు రోడ్లన్నీ పాడయ్యాయని వాటికి మరమ్మత్తులను రెన్యువల్ చేయాలని ఎమ్మెల్యే అంజయ్య స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పీకర్ సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానం కోరారు. వాటి వివరాలు అందాయని వీటిని పరిశీలించడం జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి సమాధానం ఇచ్చారు..