బుట్ట బొమ్మకు మెగా ఆఫర్
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. ఓ యంగ్ హీరో తో కలిసి నటించేందుకు సిద్ధమైందని ప్రచారం సాగుతోంది. అది కూడా మెగా హీరోతోనట. ప్రస్తుతం ఈ విషయం జోరుగా ప్రచారం సాగుతోంది. వివరాళ్లోకి వెళితే. చిత్రపరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈ కలర్ఫుల్ వరల్డ్ రంగుల ప్రపంచం లో ఏదీ శాశ్వతం కాదు. రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ను అందుకోవచ్చు. అదే సమయం లో ఒక్కసారిగా కెరీర్లో కిందకి పడిపోవచ్చు. ఇప్పుడు పూజ హెగ్డే పరిస్థితి కూడా అలానే ఉన్నట్టు కనిపిస్తోంది. 'ఒక లైలా కోసం' చిత్రం తో చిత్రపరిశ్రమ కు పరిచయమైన పూజాహెగ్డే.. ఆ తర్వాత స్టార్ హీరోల కు జోడీ గా నటిస్తూ వరుస హిట్లను అందుకుంది. దర్శకులు లక్కీ హీరోయిన్గా కూడా మారిపోయింది. కానీ రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా. ఒక్కసారిగా కెరీర్ డౌన్లో పడిపోయింది. గతేడాది నుంచి ఇప్పటివరకు వరుసగా ఐదు డిజాస్టర్లను అందుకుంది. రీసెంట్ గా మహేశ్ బాబు గుంటూరు కారం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల నుంచి కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె కెరీర్ సందిగ్ధం లో పడింది.ఈ క్రమంలోనే ఇప్పుడీ ముద్దుగుమ్మ ఓ యువ హీరోతో జోడీ కట్టేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. గతం లోనూ ఆమె కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు యంగ్ హీరో అక్కినేని అఖిల్తో కలిసి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు 'విరూపాక్ష'తో రీసెంట్గా సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో సాయి తేజ్తో కలిసి సినిమా చేయనుందని తెలిసింది. సంపత్ నంది దర్శకత్వం లో ఈ సినిమా రూపొందనుందట. పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్గా దీన్ని నిర్మించాల ని ప్లాన్ చేస్తున్నారట.