రాబోయే పార్లమెంట్  ఎన్నికల్లో బీజేపీ దే విజయం - బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్

రాబోయే పార్లమెంట్  ఎన్నికల్లో బీజేపీ దే విజయం -  బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్


మోత్కూర్(ముద్ర న్యూస్): కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లో విఫలం అయ్యిందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్ అన్నారు.బుధవారం బీజేపీ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మోత్కీర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.రాష్టంలో బి ఆర్ ఎస్ ,కాంగ్రెస్ గత ఎన్నొకల్లో తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి  వచ్చారని అన్నారు.

ప్రజలు ఇప్పుడు తప్పుడు మాటలు వినే పరిస్థితి లో లేరని అన్నారు.కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ  చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియచేయాలని అన్నారు. ఈ  కార్యక్రమం లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ,రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ ,రాష్ట్ర నాయకులు పాపారావు, కృష్ణ యాదవ్, పడాల శ్రీనివాస్, మండల నాయకులు ఏనుగు జితేందర్ రెడ్డి, జి సోమనసయ్య ,డిటి సందీప్ ,డిటి సంధ్యారాణి, బొట్టు అబ్బయ్య, బొట్టు కృష్ణయ్య ,పోచం సోమయ్య ,లింగాల శ్యామ్ సుందర్ రెడ్డి, మరాటి అంజయ్య ,ఏనుగు జితేందర్ రెడ్డి, మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు