జాతిపిత త్యాగం చిరస్మరణీయం - రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 

జాతిపిత త్యాగం చిరస్మరణీయం - రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జాతిపిత మహాత్మాగాంధీ త్యాగం ఎనలేనిదని, ఆయన జీవనం నేటి ప్రజలకు ఆదర్శమని రాష్ట్ర దేవాదాయ, న్యాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గాంధీ జయంతి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లోని బాపూజీ విగ్రహానికి, సమీకృత జిల్లా కలెక్టరేట్ లో, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో గాంధీజీ చిత్ర పటానికి ఇంద్రకరణ్ రెడ్డి కలిసి జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో మహాత్ముని పాత్ర ఎనలేనిదని కీర్తించారు. సత్యం, అహింస ఆయుధాలుగా గాంధీజి భారత స్వరాజ్య సంగ్రామ చరిత్ర లో నూతన అధ్యాయానికి నాంది పలికారన్నారు.బాపు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ముందుకెళ్ళాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.